పన్ను వసూళ్ల లక్ష్యాలను పూర్తి..
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్థి, కుళాయి, డ్రైను, ఖాళీ స్థలం, వాణిజ్య ప్రకటనల పన్నులతో పాటు ప్రతి ఇంటి నుంచి యూజర్ చార్జిల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు కమిషనర్ శ్రీమతి హరిత ఆదేశించారు. నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులతో కార్యాలయంలోని సమావేశ మందిరంలో కమిషనర్ సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నగర పాలక సంస్థ ద్వారా అందిస్తున్న వివిధ సేవలను నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. నగర పాలక సంస్థ జారీ చేసే ట్రేడ్ లైసెన్స్ ల ఆవశ్యకతపై వ్యాపార వర్గాలకు అవగాహన పెంచి, నగర వ్యాప్తంగా అన్ని షాపులను లైసెన్సుల పరిధిలోకి తేవాలని శానిటేషన్ విభాగం అధికారులను ఆదేశించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో (క్లాప్) భాగంగా ప్రతీ ఇంటినుంచి ప్రణాళికాబద్ధంగా చెత్తను సేకరించాలని, యూజర్ చార్జీల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సచివాలయాల వారీగా పన్నుల లక్ష్యాలను నిర్దేశించి, వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. సచివాలయ అడ్మిన్, వి.ఆర్.ఓ, ప్లానింగ్ కార్యదర్శులను సమన్వయం చేసి రీ సర్వే పనులను వేగవంతం చేయాలని, సర్వేలో అన్ని వివరాలను సమగ్రంగా పొందుపరచాలని కమిషనర్ ఆదేశించారు. సచివాలయాల వారీగా రీ సర్వే పనులను పూర్తి చేసి, రికార్డులను పదిలపరచాలని కమిషనర్ సూచించారు.
అన్ని డివిజనుల్లో వీధి కుక్కల నియంత్రణకై పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, కుక్కలపై ఫిర్యాదులను 9553219996 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని ప్రజలకు కమిషనర్ సూచించారు.ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీ.ఎస్,డీజీపీల సమావేశం:- అమరావతి: పోలింగ్ రోజు,,ఆటు తరువాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ వద్ద ట్యాంకు క్లియర్ వాటర్ పంపింగ్ స్టేషన్ నుండి కొత్తూరుకు…
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
This website uses cookies.