AMARAVATHI

తిరుమలలో అడవి మృగం బారిన పడి చిన్నారి మృతి

తిరుమల: శ్రీవారి దర్శనం కోసం మెట్ట మార్గంలో వెళ్లుతున్న ఓ కుటుంబం బిడ్డను పోగొట్టుకుంది..నెల్లూరు జిల్లా పొతిరెడ్డిపాళెంకు చెందిన రెండు కుటుంబాలు (మొత్తం దాదాపు పిల్లలు పెద్దలు కలసి 10 మంది వరకు వుంటారు) శుక్రవారం కారులో తిరుపతికి చేరుకున్నారు..వీరు రాత్రి 8 గంటలకు అలిపిరి నుంచి మెట్లమార్గంలో కొండపైకి బయలుదేరారు..రాత్రి 11 గంటల సమయానికి లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు..కుటుంబ సభ్యులు మాటాల్లో వుండగా పాప లక్షిత(6) కనిపించకుండా పోయింది..ఏటు వెళ్లింది ? ఏమైందని ? చుట్టు ప్రక్కల గాలించారు..కానీ ఎక్కడా పాప కనిపించలేదు.. పోలీస్ స్టేషన్ లో పాప కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు..పోలీసులు మిస్సింగ్ కేసే నమోదు చేసి,,పాప కనిపించకుండా పోయిన ప్రాంతం ప్రక్కనే వున్న అడవిలో గాలింపు మొదలుపెట్టారు..శనివారం ఉదయం పాప కన్పించకుండా పోయిన ప్రాంతంకు దగ్గరలోనే,,పాప అడవి జంతువు దాడి చేసినట్లుగా భావిస్తున్న గుర్తులతో మృతుదేహం కన్పించింది.. మృతుదేహంను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.. .రుయా ఆసుపత్రి మార్చురీ వద్ద పాప మృతదేహాన్ని చూసిన తర్వాత డీఎఫ్ఓ మీడియాతో మాట్లాడారు. పాపపైన దాడిని చూసినప్పుడు చిరుత అయితే లోతైన గాయాలు అయ్యేవి అనిపిస్తోందన్నారు..ఎలుగుబంటి దాడి చేసిందా అన్న అనుమానం వుందని,, పోస్టుమార్టం రిపొర్డు వస్తే కాని ఏ విషయం చెప్పలేమన్నారు..భక్తులు నడక దారిలో గుంపులు గుంపులుగా వెళ్లడం శ్రేయస్కరమని చెప్పారు.( ఎవరు ఎన్ని చెప్పిన బిడ్డను పొగొట్టుకుని తల్లి,తండ్రుల ఆవేదన తీర్చలేనిది).
జూన్ 23న తిరుమల నడకదారిలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది..కర్నూలు జిల్లా ఆదోని, హనుమాన్ నగర్ కు చెందిన శిరీష, కొండయ్యల కుటుంబ సమేతంగా జూన్ 23న తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. నడకమార్గంలో కౌశిక్(5)తో వెళ్తుండగా ఏడో మైలురాయి దగ్గరకు చేరుకోగానే ఒక్కసారిగా చిరుత దాడి చేసింది.. అమాంతం కౌశిక్ మెడ కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లింది..చుట్టూ ఉన్న వాళ్లు కేకలేయడంతో వెంటనే వదిలేసి పరారైంది..చిరుత దాడిలో బాలుడు కౌశిక్ తీవ్రంగా గాయపడ్డాడు..తిరుపతిలోని చిన్న పిల్లల ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకున్నాడు..శ్రీవారి దర్శనం అనంతరం వారు ఇంటికి వెళ్లారు.
2021 డిశంబరు 5వ తేది తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులపై చిరుతపులి దాడి చేసింది.. రెండో ఘాట్ రోడ్డులోంచి విధులకు వెళుతున్న ఎఫ్.ఎం.ఎస్ సిబ్బంది ఆనంద్, రామకృష్ణలపై వినాయకుడి గుడి దాటిన తర్వాత ఒక్కసారిగా చిరుత దాడి చేసింది..ఈ దాడిలో ఇద్దరు యువకులు స్వల్పగాయాలతో బయటపడ్డారు..సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్ధలానికి వచ్చి అంబులెన్స్ లో ఇద్దరినీ తిరుమల అశ్విని ఆస్పత్రికి తరలించారు.. చిరుత రోడ్డు దాటే క్రమంలో ఇద్దరూ బైక్ పై రావటంతో ఈ సంఘటన జరిగి ఉండవచ్చని అధికారులు భావించారు.
          ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే అధికారులు హడవిడి చేస్తారే తప్ప? తరువాత ఏ విషయం పట్టించుకోరని భక్తులు కోపం,ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..మరి అధికారులు ఏవైన జాగ్రత్తలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

14 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

14 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

19 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

1 day ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.