ఎంసీడీ మేయర్గా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్
అమరావతి: మునిపాల్ కార్పరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD ) మేయర్గా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు..షెల్లీ ఒబెరాయ్ తన సమీప బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.. మొత్తం 266 ఓట్లు పోల్ కాగా, షెల్లీ ఒబెరాయ్కు 150, రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి..బుధవారం ఉదయం 11.30 గంటలకు ఎంసీడీ సమావేశమైంది.. మేయర్, డిప్యూటీ మేయర్, ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నిక జరగాల్సి సమయంలో,సభ్యుల మధ్య వాగ్వివాదలతో సభా కార్యక్రమాలకు మూడు సార్లు వాయిదా పడింది..అనంతరం మేయర్ పదవికి ఓటింగ్ జరిగింది.