DISTRICTS

మనం-మన గ్రంథాలయం పేరిట గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు-మంత్రి

నెల్లూరు: గ్రంధాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మనం-మన గ్రంథాలయం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నెల్లూరు రేబాలవారి వీధిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన మనం-మన గ్రంథాలయం  కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ  సంస్థ చైర్మన్ శేషగిరి రావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గతంలో గ్రంధాలయ సంస్థలను కేవలం పదవులు భర్తీ చేసేందుకు వాడుకున్నారని, ఎటువంటి విషయ పరిజ్ఞానం లేని వారిని చైర్మన్లుగా నియమించడంతో గ్రంథాలయాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గంధాలయాల పటిష్టత పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఈ క్రమంలోనే మనం- మన గ్రంథాలయం పేరిట గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గ్రంథాలయాల్లో మౌళిక వసతుల కల్పనకు జిల్లాకు కోటి రూపాయలను సీఎం మంజూరు చేయగా, గ్రంథాలయాలకు అవసరమైన పుస్తకాలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ లు ఆయా గ్రంధ పాలకులకు అందజేసినట్లు చెప్పారు. అలాగే జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా సమాజంలో గ్రంథాలయాల ఆవశ్యకతను గుర్తించి, వాటి అభివృద్ధికి సహకరించాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గ్రంథాలయాల అభివృద్ధికి చేపడుతున్న అనేక కార్యక్రమాలను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి దొంతు శారద, పాఠకులు,తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

15 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

19 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

19 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

19 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

2 days ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

2 days ago

This website uses cookies.