DISTRICTS

ఉద్యోగులందరూ తప్పనిసరిగా ముఖ హాజరులో పేర్లు నమోదు చేసుకోవాలి-కలెక్టర్

నెల్లూరు:  స్పందన అర్జీలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో కలెక్టర్, సంయుక్త కలెక్టర్ రోణంకి కూర్మనాధ్, డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మలతో కలిసి  స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అంతకుమునుపు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి స్పందన అర్జీల పరిష్కారం, ముఖ హాజరు, కోర్టు కేసుల పరిష్కారం, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు తదితర అంశాలపై పలు సూచనలు జారీ చేశారు.

                జిల్లాలో ముఖ హాజరుకు సంబంధించి ఇంకా చాలా ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వారి పేర్లను నమోదు చేసుకోలేదని,  కొందరు నమోదు చేసుకున్నసరిగా వినియోగించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తమ ఉద్యోగులందరూ తప్పనిసరిగా ముఖ హాజరులో పేర్లు నమోదు చేయడంతో సహా ప్రతిరోజు నూటికి నూరు శాతం ముఖ హాజరు అయ్యేలాగా పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో 1644 కోర్టు రిట్ పిటిషన్లు,  307 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రధానంగా జలవనుల శాఖలో 186 పంచాయతీరాజ్ శాఖలో 41 కేసులు అత్యధికంగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. కోర్టు కేసుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కోర్టుదికరణ కేసులకు వెంటనే కౌంటర్ ఆఫిడవిట్లు దాఖలు చేసి వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈనెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కావలి రానున్నారని, ఆరోజున చుక్కల భూములు, రీ సర్వే కార్యక్రమం సంబంధించి ప్రత్యేక ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. రహదారులు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో చేపట్టవలసిన పనులకు సంబంధించి అంచనాలు సిద్ధం చేసి మంజూరు కోసం ఈ సోమవారమే ఉన్నతాధికారులకు పంపాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

19 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

19 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

24 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.