అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు పెరిగిపోతున్న అప్పులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్,, మంగళవారం ట్విట్టర్ వేదికగా సీఎం జగన్పై విమర్శలు చేశారు..ఒక కార్టూన్తో కూడిన ట్వీట్ చేస్తూ ‘‘అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారు మోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. కీప్ ఇట్ అప్? మీ సంపదను పెంచుకోవడం మాత్రం మర్చిపోకండి..రాష్ట్ర అభివృద్ధి, సంపదను కుక్కలపాలు చేయండి..మీ సంపద, ఆస్తుల్ని మాత్రం పెంచుకోండి..అదే ముఖ్యమంత్రి స్ఫూర్తి’’ అని పవన్ ట్వీట్ చేశారు..దీనికి ఒక కార్టూన్ కూడా జత చేశారు..అందులో సీఎంకు ‘అప్పురత్న’ అవార్డు ఇస్తున్నట్లుగా ఉంది..ఈ కార్టూన్లోనే తొమ్మిది నెలల్లో ఏపీ రూ.55,555 కోట్లు అప్పు చేసినట్లు పేర్కొన్నారు…ఇది వైసీపీ ప్రభుత్వం రికార్డుగా పవన్ అభివర్ణించారు..తాజా నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఏపీ అప్పు రూ.55 వేల కోట్లు దాటింది..అంటే సగటున రోజుకు రూ.205 కోట్ల చొప్పున ఏపీ అప్పు చేస్తోంది..నెలకు రూ.6,172 కోట్లను అప్పుగా తీసుకుంటోంది..దీంతో ఏపీ అప్పుల భారం పెరిగిపోతోంది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.