ప్రమాద వశాత్తు కూలిన ఆర్మీ హెలికాప్టర్
అమరావతి: జమ్మూకశ్మీర్లో ప్రమాదవశాత్తు ఓ ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది..ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో వున్న ముగ్గురు పైలట్లు తీవ్రంగా గాయపడ్డరని,,గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు..ALH ధ్రువ్ హెలికాప్టర్ కూలిందని ఆర్మీ వర్గాలు ధ్రువీకరించాయి..కిష్టావర్ జిల్లాలోని మర్వా తహసీల్ పరిధి మచ్చన గ్రామంలో హెలికాఫ్టర్ ఒక్కసారిగా సాంకేతిక లోపంతో కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు..మార్వా ప్రాంతంలోని నదిలో హెలికాప్టర్ శకలాలు గుర్తించారు..ఆర్మీ హెలికాఫ్టర్ కూలిన ప్రదేశంలో ఇండియన్ ఆర్మీ, సహస్రబల్, పోలీసులు సంఘటన స్థలంకు చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు..ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.