NATIONAL

జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 భవిష్యతులో తిరిగి రాదు-గులాం నబీ ఆజాద్

అమరావతి: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 భవిష్యతులో తిరిగి రాదని కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు..కొన్ని పార్టీలు ఆర్టికల్ 370 కశ్మీరీల్లో అపోహలను కల్పిస్తున్నారని, తాను మాత్రం అలాంటి అపోహలకు తావివ్వబోనని ఆయన పేర్కొన్నారు..ఆదివారం ఉత్తర కశ్మీర్ అయిన బారాముల్లాలో బహిరంగ సభ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ “గులాం నబీ ఆజాద్ ఎవరినీ తప్పుదోవ పట్టించాలని అనుకోవడం లేదు. ఓట్ల కోసం ఎవరికీ అబద్ధాలు చెప్పదల్చుకోలేదు.సాధ్యం కాని విషయాలపై చర్చలు, భావోద్వేగాలు రెచ్చగొట్టొద్దని నేను విజ్ణప్తి చేస్తున్నాను. ఆర్టికల్ 370 ఇక ఎప్పటికీ తిరిగి రాదు. దానికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. అది కశ్మీర్ నుంచి సాధ్యం కాదు” కుండబద్దలు కొట్టారు..ఆర్టికల్ 370 తీసుకొచ్చే పరిస్థితిలో ఏ పార్టీ లేదని,,కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ మరింత మునుగుతోందని, ఇక ప్రాంతీయ పార్టీల శక్తిసామర్థ్యాల గురించి చెప్పక్కర్లేదన్నారు.. జమ్మూ కశ్మీర్కు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 370ని ఆగస్టు 5, 2019లో పార్లమెంట్ రద్దు చేసింది. అప్పటి నుంచి కశ్మీర్లో వివిధ రాజకీయ పార్టీలు ఆర్టికల్ 370ని పునరుద్దరించాలని,,ఇదే విషయమై రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి గుప్కార్ అలయెన్స్గా ఏర్పాటై డిమాండ్ చేస్తున్నాయి..

 

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

7 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

9 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

13 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

13 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

17 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.