HYDERABAD

సీబీఐ విచారణకు హాజరు కాకుండనే వెనుతిరిగిన అవినాష్ రెడ్డి

హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శుక్రవారం సీబీఐ విచారణకు హాజరు కావల్సిన ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి డూమ్మ కొట్టారు..సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన ఉదయం 10 గంటల సమయంలో సీబీఐ కార్యాలయంకు బయలుదేరారు..అదే సమయంలో ఆయనకు పులివెందుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. ఆయన తల్లి అనారోగ్యంతో పులివెందుల ఆస్పత్రిలో చేరారన్న సమాచారం వచ్చింది..దీంతో ఆయన సీబీఐ విచారణకు రాలేనని,,తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో పులివెందులకు వెళ్తున్నానని సీబీఐ అధికారులకు లేఖ రాసి,, హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు..అవినాష్ రెడ్డి రాసిన లేఖ విషయంలో సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించలేదు..ఈ విషయంలో అవినాష్ రెడ్డి వ్యవహరిస్తూన్న తీరుపై సీబీఐ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *