NATIONAL

ఏటీఎం నుంచి కరెన్సీ నోట్లకు బదులు పాము పిల్లలు

అమరావతిం ATM మెషీన్ లో నుంచి కరెన్సీ నోట్లకు బదులు పాము పిల్లలు బయటకు రావటం కలకలం రేకేత్తించింది.. ఉత్తరాఖండ్ లోని నైనితాల్‌ జిల్లాలో రామ్‌నగర్‌ కోసీ రోడ్డులో ఉన్న SBIకు చెందిన ATMకు డబ్బులు విత్‌డ్రా చేసుకోవటానికి బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి వెళ్లాడు. డబ్బుల కోసం కార్డు వుంచి పిన్ నెంబరు ఎంటర్ చేసిన తరువాత డబ్బులు వస్తాయని ఎదురు చూస్తుండా ఓ పాముపిల్ల బయటకు వచ్చింది..అంతే అతను షాక్ అయ్యాడు..తేరుకున్న సదరు వ్యక్తి వెంటనే ఏటీఎం సెక్యూరిటీ గార్డుకు విషయాన్ని తెలిపాడు..అలాగే సేవ్ ది స్నేక్‌ అండ్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు చంద్రసేన్‌ కశ్యప్‌ కూడా సమాచారం అందించాడు.. సమాచారం అందుకున్నబ్యాంకు అధికారులు, ఏటీఎం మెషిన్ డోర్ ఓపెన్ చేశారు..అందులో 10 పాము పిల్లలు ఉన్నట్లు గుర్తించారు..విషపూరితమైన పాములని తెలిపారు..వాటికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా వాటిని పట్టుకుని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు..ఆ తరువాత బ్యాంకు సిబ్బంది ఆ ఏటీఎంను తాత్కాలింగా మూసివేశారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *