AMARAVATHI

కాపుల రిజర్వేషన్‌ బిల్లుపై  కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

అమరావతి: కాపుల రిజర్వేషన్‌ బిల్లుపై  కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది..2019లో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం చట్టబద్ధమేనని స్పష్టం చేసింది..బుధవారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భౌమిక్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు..ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరంలేదని వివరించారు..రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఏ కులానికైనా OBC రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని తెలిపింది..OBC రిజర్వేషన్ అంశం రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి 2019లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ చేసిన చట్టం చట్టబద్ధమేనని వివరించింది..2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం,,సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారుచేసుకోవచ్చునని కేంద్రం పేర్కొంది..అలాగే 103వ రాజ్యాంగ సవరణ చట్టం-2019 ద్వారా రాష్ట్రప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు గరిష్ఠంగా 10 శాతం రిజర్వేషన్ కల్పించవచ్చని బుధవారం ఇచ్చిన సమాధానంలో కేంద్ర సామాజిక, న్యాయశాఖ స్పష్టత ఇచ్చింది.EWS రిజర్వేషన్ల కోటా 10 శాతం కాగా ఇందులో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అగ్రవర్ణాలకు కల్పిస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వం బిల్లులో పేర్కొంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *