నకిలీమద్యం కేసులో నిందితుడని,శాసనమండలికి పంపితే అక్రమాలకు పాల్పడే అవకాశం- రాజేంద్ర ప్రసాద్
నెల్లూరు: సీ.ఎం జగన్ రైతులను అన్ని విధాల అదుకుని వుంటే రైతులు ఆత్మహాత్యలు ఎందుకు చేసుకుంటున్నరని మాజీ మంత్రి ఆళ్ళపాటి రాజేంద్ర ప్రసాద్ నిలదీశారు..నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ లో వెంకట్ రెడ్డినగర్ లో మంగళవారం తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు..ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శాసనమండలిని రద్దు చేస్తామని ప్రకటించిన సీఎం జగన్ కు..ఎమ్మెల్సీ ఓటు అడిగే హక్కు లేదన్నారు.. పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నకిలీమద్యం కేసులో నిందితుడని,,అతన్ని శాసనమండలికి పంపితే..భవిష్యత్ లో ఎన్నో అక్రమాలకు పాల్పడే అవకాశముందన్నారు..టీడీపీ అభ్యర్దిగా బరిలో ఉన్న కంచర్ల శ్రీకాంత్ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అన్నారు.. అతన్ని గెలిపిస్తే నిరుద్యోగుల గొంతుకై శాసనమండలిలొ పొరాడతారని వారు వ్యాఖ్యానించారు….