కోడికత్తితో కేసులో సీ.ఎం జగన్ విచారణకు హాజరుకావాలి-ఎన్ఐఏ కోర్టు
అమరావతి: విశాఖపట్నం విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కోడికత్తితో జరిగిన హత్యాయత్నం కేసులో విచారణకు హాజరుకావాలని సీ.ఎం జగన్మోహన్ రెడ్డికి ఎన్ఐఏ విజయవాడ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది..ఏప్రిల్ 10న విచారణకు సీఎం జగన్ హాజరుకావాలని అలాగే.సీఎంతో పాటు PA నాగేశ్వరరెడ్డి కూడా కావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది..కోడికత్తి కేసుపై ఎయిర్పోర్ట్ అథారిటీ CISF అసిస్టెంట్ కమాండర్ దినేష్ను సాక్షిగా NIA కోర్టు విచారించింది..తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 10కి వాయిదా వేసింది..