మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు
అమరావతి: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను మంగళవారం కోర్టు తిరస్కరించింది.. జస్టిస్ దినేష్ కుమార్ శర్మతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ, మనీష్ సిసోడియాపై ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొంది..సిసోడియా బెయిల్ పై బయటకెళ్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్న దృష్ట్య బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది..ఢిల్లీ హైకోర్టు తీర్పుతో మనీష్ సిసోడియా సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు సమాచారం.. మనీష్ సిసోడియాను ఢిల్లీ లిక్కర్ కేసులో ఫిబ్రవరి 29వ తేదిన సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు..ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు సిసోడియా కస్టడీని జూన్ 1వ తేది వరకు పొడిగించింది.