హైదరాబాద్: న్యూఇయర్ ఈవెంట్స్ పై జంటనగరాల పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు..అనుమతులు లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు..సన్ బర్న్ ఈవెంట్ కు ఎలాంటి అనుమతులు లేవని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి.స్పష్టం చేశారు..అనుమతులు లేకుండా సన్ బర్న్ ఈవెంట్ టికెట్లు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..బుక్ మై షో ప్రతినిధులను పిలిపించి హెచ్చరించిన సీపీ,, అనుమతులు లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు..న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా సరే తప్పకుండా అనుమతులు తీసుకోవాల్సిందే అని కమీషనర్ స్పష్టం చేశారు..న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా సరే తప్పకుండా అనుమతులు తీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు..ఎక్సైజ్ నుంచి లెటర్ లేకుండానే పోలీస్ అనుమతి కోరారని,, అందుకే అనుమతి నిరాకరించామన్నారు..అనుమతులు తీసుకోకుండా సన్ బర్న్ ఈవెంట్ కు సుమంత్ అనే వ్యక్తి బుక్ మై షో లో టికెట్లు విక్రయిస్తున్నాడని,, అతనిపై కేసు నమోదు చేశామని తెలిపారు..సన్ బర్న్ ఈవెంట్ నిర్వాహాకులు,, బుక్ మై షో ఎండీతో సహా నోడల్ అధికారికి నోటీసులు జారీ చేశామన్నారు..ఈవెంట్లు నిర్వహించే పబ్బులకు, నిర్వాహకులకు డ్రగ్స్ అక్కడికి రాకుండా చూసుకునే బాధ్యత వాళ్ళదే అని స్పష్టం చేశారు..ఈవెంట్ కి వచ్చే వారి ఐడీ కార్డులతో సహా బ్యాగులు తనిఖీ చేసి లోపలికి అనుమతించాలన్నారు.. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, పార్కింగ్ ప్రదేశాలు ఉండాలి, అధిక సంఖ్యలో పాసులు జారీ చేయకూడదు అని చెప్పారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,,ఆదివారం కలెక్టర్లు,, ఎస్పీలతో సమావేశం నిర్వహించి,,న్యూ ఇయర్ వేడుకల కోసం నిర్వహించే ఈవెంట్లపై సీరియస్ అయ్యారు.. ఈవెంట్ల నిర్వహణ, అనుమతులపై పోలీసు అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.. గోవా, మహారాష్ట్ర, కర్నాటక లాంటి రాష్ట్రాలు …సన్ బర్న్ లాంటి ఈవెంట్లను రద్దు చేస్తే తెలంగాణలో అవి అవసరమా అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యనించినట్లు సమాచారం..దింతో జంటనగరాల పోలీసులు ఆప్రమత్తమైయ్యారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.