CRIMENATIONAL

జమ్మూ కాశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం-11 మంది మృతి

అమరావతి: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని బరేరి నల్లా సమీపంలో మినీ బస్సు లోయలో పడిపోయింది..ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణిస్తుండగా, వారిలో 11 మంది మృతి చెందగా,27 మందికి గాయాలయ్యాయి.. బుధవారం బస్సు సావ్జియాన్ నుంచి మండికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది..ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, ఆర్మీ సహాయక చర్యలు చేపట్టారు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మండిలోని ఆస్పత్రికి తరలించారు..మినీ బస్ ప్రమాదంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. మినీ బస్సు ప్రమాదంలో మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు..ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *