డయల్ యువర్ కమీషనర్ 0861-2355678 – కమిషనర్ వికాస్
నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కమీషనర్ వికాస్ మర్మత్ ఆకాంక్షించారు. సోమవారం నాడు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగే స్పందన వేదికలో ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం ‘డయల్ యువర్ కమీషనర్’ కార్యక్రమంలో భాగంగా ఉదయం 9:30 నుంచి 10:30 వరకు 0861-2355678 నెంబరుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చును. కార్యాలయంలో కమీషనర్ ను నేరుగా కలిసి సమస్యలను ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అందుకున్న సమస్యలను వీలున్నంత త్వరగా పరిష్కారం అందించేందుకు అన్ని విభాగాలను సమన్వయం చేసుకొని కృషి చేస్తామని కమీషనర్ తెలిపారు.