నెల్లూరు: తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పాటుకు కోటి రూపాయల విలువైన స్థలాన్ని ఉచితంగా అందజేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉదార స్వభావానికి నిదర్శనమని,ఇదే స్ఫూర్తితో భవన నిర్మాణానికి కృషి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వెంకటాచలం సమీపంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ అధ్యయన కేంద్రాన్ని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సాధిస్తే, భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేక కృషితో వెంకటాచలంలో నెలకొల్పడం జరిగిందన్నారు..ఈ కేంద్రానికి సొంత స్థలంలో భవన నిర్మాణాల విషయమై భారత ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. సొంత భవనాలు కూడా నిర్మించి తెలుగు భాష ప్రాశస్త్యం, ప్రాభవం భవిష్యత్ తరాలకు తెలిసేలా ఈ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని, తద్వారా తెలుగు భాష పూర్వ వైభవానికి ఎల్లవేళలా కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.