నెల్లూరు: మార్కెట్లో డిమాండ్ ఉన్న వృత్తి నైపుణ్య కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న వృత్తి నైపుణ్య కోర్సులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతకు ఉపయోగపడే వృత్తి విద్య కోర్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్, ప్లంబింగ్, డ్రైవింగ్, జేసీబీ, క్రేన్ ఆపరేటింగ్, పెయింటింగ్ మొదలైన కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న 10 డెవలప్మెంట్ హబ్ లలో ఈ కోర్సులను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి వినీల్ కుమార్, డి ఆర్ డి ఏ పీడీ సాంబశివారెడ్డి, గవర్నమెంట్ ఐటిఐ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ శ్రీధర్ రెడ్డి, జేఈవో భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు: మూడు నెలల్లో...7 వేలను ఇళ్లను తిరిగి...ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నానని...వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని...మాజీ…
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…
నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
This website uses cookies.