నెల్లూరు: సఫాయీ మిత్ర సురక్షా ఛాలెంజ్ పధకం అమలులో భాగంగా దేశ వ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్ కార్మికుల రక్షణకై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఆదేశించారు. గురువారం భూగర్భ డ్రైను కార్మికులు, డీ స్లెడ్జింగ్ ఆపరేటర్లకు అందుతున్న వివిధ రక్షణా ఉపకరణాలు, సౌకర్యాల గురించి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో నగర పాలక సంస్థ అందించిన యూనిఫామ్, చేతి తొడుగులు, హెల్మెట్, షూస్, మాస్క్ లను తప్పనిసరిగా ప్రతీ కార్మికుడు వినియోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాల నివారణకై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. భూగర్భ డ్రైను పనులలో భాగంగా మ్యాన్ హోల్స్ శుభ్రతకై యంత్రాలను మాత్రమే వినియోగించాలని అదేశించారు. ప్రభుత్వం సూచించిన అన్ని రక్షణా నిబంధనలను పాటిస్తూ, స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు కృషి చేయాలని కమిషనర్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈలు సంజయ్, చంద్రయ్య, ఏ.ఈ మాధవి పాల్గొన్నారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.