AMARAVATHINATIONAL

మధ్యప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం-15 మంది మృతి

అమరావతి: మధ్యప్రదేశ్ లో మంగళవారం ఉధయం 8.40 గంట సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు..శ్రీఖండి నుంచి ఇండోర్ కు వెళ్తోన్న బస్సులో దాదాపు 59 మంది ప్రయాణికులు వున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నర్రోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు..బస్సు ఖార్గోన్ జిల్లాలో బ్రిడ్జీ వద్దకు రాగానే అదుపు తప్పి బ్రిడ్జి రెయిలింగ్ ను ఢీకొట్టడంతో ఢీ కొట్టి నదిలో పడిపోయింది..దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి..క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. స్థానికులు ఘటనాస్థలంలో వద్దసహాయక చర్యలు చేపట్టారు..ప్రమాదంలో మరణించిన వారికి రూ.4 లక్షలు,,త్రీవంగా గాయపడిన వారికి రూ.50 వేలు,,స్వల్ప గాయాలు అయిన వారికి రూ.25 వేలు సహాయం అందచేస్తున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *