DISTRICTS

పీజీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి-యచేంద్ర

నెల్లూరు: GO.77 రద్దు చేసి పూర్తి స్థాయిలో పీజీ విద్యార్ధులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని,, రాష్ట్రంలోని వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యచేంద్ర డిమాండ్ చేశారు.బుధవారం నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నంచిగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.. రాష్ట్రంలో విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాటికి నిరసనగా నేడు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టడం జరిగింది..ఈ సందర్బంలో యచేంద్ర మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలలో రాజకీయాలు చేస్తున్న వైస్ ఛాన్సలర్ లపై, రిజిస్ట్రార్ లపై చర్యలు తీసుకోవాలని కోరారు..జాబ్ కాలెండరును విడుదల చేయాలని డిమాండ్ చేశారు…ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజశేఖర్, నెల్లూరు జిల్లా కన్వీనర్ అశోక్, నగర కార్యదర్శి యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *