ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం
అమరావతి: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం అందచేసింది.. ప్రధాని నరేంద్ర మోదీ వహించిన ప్రపంచ నాయకత్వానికి కానూ ‘‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’’తో సత్కరించారు.. ప్రధాని నరేంద్ర మోదీ, ఫిజీ దేశానికి చెందిన సితివేణి రబుకా నుంచి పతకాన్ని అందుకున్నారు.. ఫిజియేతర వ్యక్తికి అరుదైన గౌరవంగా ప్రధాని నరేంద్ర మోదీని పౌర పురస్కారంతో సత్కరించారు.‘‘ ఫిజీ పౌర పురస్కారం మన ప్రధానికి లభించడం భారతదేశానికి పెద్ద గౌరవం..ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ఫిజియేతరులు కొద్దిమంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది..ఇరు దేశాల మధ్య మైత్రిలో కీలక పాత్ర పోషించిన భారత ప్రజలకు,, ఫిజీ-ఇండియన్ ప్రజలకు ప్రధాని మోదీ ఈ గౌరవాన్ని అంకితం చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో తెలిపింది.
Grateful to the people and Government of Fiji for conferring the Companion of the Order of Fiji on me. I thank PM @slrabuka for presenting the award. It is an honour for the people of India and a recognition of the strong ties between India and Fiji. pic.twitter.com/rhUPrE0Nvu
— Narendra Modi (@narendramodi) May 22, 2023