Categories: DISTRICTS

ఆస్తి,కొళాయి,ఖాళీ స్థలం పన్నుల వసూళ్లపై దృష్టి సారించండి-కమిషనర్ హరిత

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ఈనెల 31 వ తేదీ లోపు అన్ని రకాల పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో మంగళవారం ఉదయం నిర్వహించారు. సమీక్షలో కమిషనర్ మాట్లాడుతూ ఆస్తి పన్ను, కొళాయి పన్ను, ఖాళీ స్థలం పన్నుల వసూళ్లపై రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో కృషి చేసి ఉన్నత ఫలితాలను సాధించాలని సూచించారు.ఇప్పటివరకు పన్నులు జారీ చేయని వారిని గుర్తించి వెంటనే సంబంధిత పన్ను నోటీసులను జారీ చేసి వసూళ్లు చేయాలని కమిషనర్ ఆదేశించారు. వివిధ విభాగాలలో పెండింగ్లో ఉన్న ఫైళ్లను నిర్దిష్ట కాలంలో లోపు పరిష్కరించాలని, గడువు దాటితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయం అడ్మిన్ కార్యదర్శుల పన్ను వసూళ్లపై స్పెషల్ ఆఫీసర్లంతా పర్యవేక్షించాలని, సచివాలయం విధి నిర్వహణ సమయంలో ప్రతి ఒక్క కార్యదర్శి కార్యాలయంలోనే ఉండేలా తనిఖీలు నిర్వహించాలని రెవెన్యూ అధికారులను సూచించారు.సచివాలయ కార్యదర్శులు అంతా క్రమం తప్పకుండా ప్రభుత్వం సూచించిన డ్రెస్ కోడ్ యూనిఫామ్ ను ధరించేలా స్పెషల్ ఆఫీసర్లు సచివాలయాలను తరచుగా తనిఖీలు నిర్వహించి పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

4 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

This website uses cookies.