లాయర్ వేషంలో వచ్చి గ్యాంగ్ స్టర్ సంజీవ్ జీవాపై కాల్పులు-ఘటన స్థలంలోనే మృతి
అమరావతి: ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో ఎస్పీ,ఎస్టీలో విచారణకు గ్యాంగ్ స్టర్ సంజీవ్ మహేశ్వరీ జీవా హాజరు కాగా కోర్టు వెలుపల జీవాపై అతి దగ్గర నుంచి దుండగులు కాల్పులు జరగడంతో,,సంఘటన స్థలంలోనే అతను మరణించాడు..సంజీవ్ పై కాల్పులు జరిపిన దుండగుడు లాయర్ వేషంలో ఉన్నట్టు సమాచారం..( సంజీవ్ మహేశ్వరీ జీవా ఓ ఆసుపత్రిలో కాంపౌండర్ గా జీవితం ఆరంభించాడు..మాఫీయా నాయకులతో ఏర్పాడిన పరిచయాలతో అండర్ వరల్డ్ లో సభ్యుడిగా మారాడు..బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్యలో ముఖ్తార్ అన్సారీతో పాటు సంజీవ్ జీవా కూడా నిందితుడిగా ఉన్నారు..బీజేపీ నేత బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో నిందింతుడిగా ఉన్న జివాను విచారణ నిమిత్తం పోలీసులు బుధశారం లక్నో కోర్టుకు తీసుకువచ్చారు..ఈ సమయంలోనే ఈ కాల్పుల సంఘటన చోటుచేసుకుంది..కాల్పుల్లో ఓ యువతి కూడా గాయపడింది..ఈ గ్యాంగ్ స్టర్ సంజీవ్పై గతంలో పలు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి..