హైదరాబాద్: భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది..32 సంవత్సరాల తరువాత మొదటిసారి రికార్డు స్థాయిలో 70 అడుగులు దాటి వరద నీరు ప్రవహిస్తోంది.. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 70 అడుగులకు చేరుకుంది.. గత 50 సంవత్సరాల్లో 3 సార్లు మాత్రమే గోదావరి నీటి మట్టం 70 అడుగులు తాకింది.. ప్రస్తుతం గోదావరిలోకి 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది..ఇంకా వరద నీరు వచ్చినట్లయితే తీసుకోవాల్సిన జాగ్రత్తల దృష్ట్య అధికారులు భద్రాచలం గోదావరి కరకట్టను డేంజర్ జోన్గా ప్రకటించారు.. ఇప్పటికే భద్రాచలంలో పలు కాలనీలు నీటమునిగాయి..రామాలయం ప్రాంతంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది..2వేల కుటంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.. (1986 ఆగష్టు 16వ తేదిన భధ్రాచలం వద్ద 75.6 అడుగులను తాకింది..అటు తరువాత 1990 ఆగష్టు 24వ తేదిన 70.8 అడుగులను చేరుకుంది.)
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.