మున్సిపల్ పాఠశాలల విలీనంపై స్టే ఇచ్చిన హైకోర్టు?
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది..గత సంవత్సరం జూన్లో మున్సిపల్ పాఠశాలలను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తూ ఇచ్చిన GOపై న్యాయస్థానం స్టే విధించింది.. మున్సిపల్ స్కూళ్ల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పురపాలక టీచర్స్ ఫెడరేషన్ (MTF) అధ్యక్షుడు రామకృష్ణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు..ఈ వ్యాఖ్యంపై గురువారం న్యాయస్థానంలో విచారణ జరిగింది..రాష్ట్ర వ్యాప్తంగా 2115 మున్సిపల్ స్కూళ్లు ఉండగా, వీటి విలీనంపై ధర్మాసం స్టే ఇచ్చింది..పురపాలక చట్టాలకు,, 74 అధికరణానికి వ్యతిరేకంగా GO 84 ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది..GO 180 ద్వారా పురపాలక పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల పెత్తనానికి అవకాశం కల్పించడం సమంజసం కాదని ధర్మాసనం వ్యాఖ్యనించింది.. GO 184 ప్రకారం విద్యాశాఖ నుంచి పురపాలక పాఠశాలల ఉపాధ్యాయుల జీతభత్యాలు చెల్లింపు చేయకూడదనే అశంపైనా పిటీషనర్తో ఏకీభవించింది..మున్సిపల్ పాఠశాలల విలీనానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన GOపై గతంలో ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారు.. కోటి 30 లక్షల మంది పట్టణ జనాభాలో 5 లక్షల మంది పిల్లలు మున్సిపల్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారని,, వారిలో 95శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలు ఉన్నారని తెలిపింది..మున్సిపల్ స్కూళ్ళ ఆస్తుల కోసమే విలీనం అంటూ అప్పట్లో ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం విదితమే..ప్రభుత్వం ఈ విషయంలోనిక్కఛ్చిగా వ్యవహరిస్తూ GO 84 ఇచ్చి విలీనం పాఠశాలలను విలీనం చేసింది..