DISTRICTS

నెలకు రూ.55 నుంచి 200 వరకు చెల్లిస్తే,రూ.3 వేలు ఫించను వస్తుంది-జడ్పీ సిఈఓ వాణి

నెల్లూరు: అసంఘటిత రంగ కార్మికులు, చిరు వ్యాపారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ పింఛన్ పథకంపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేయాలని జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ పిలుపునిచ్చారు..శనివారం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ (PMSYM) పింఛన్ పథకంపై వర్క్ షాప్ నిర్వహించారు..జడ్పీ సీఈవో శ్రీమతి వాణి మాట్లాడుతూ ఆజాది సే అంత్యోదయ తక్ 90 రోజుల కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 75 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని, అందులో మన రాష్ట్రం నుంచి నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పింఛన్ పథకాన్ని జిల్లాలో 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల చిరు వ్యాపారులు, ఆశా, అంగన్వాడి కార్యకర్తలు, ఉపాధి హామీ, వ్యవసాయ కూలీలు, డ్రైవర్లు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళలు మొదలైన అసంఘటిత రంగంలోని కార్మికులు వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు.  లబ్ధిదారుని వయస్సును బట్టి ప్రతి నెలా రు.55 నుండి రు.200 వరకు బ్యాంకు అకౌంట్ ద్వారా చెల్లిస్తే 60 ఏళ్లు దాటిన తర్వాత వారికి రూ.3000కు తగ్గకుండా పింఛన్ ను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. అన్ని కామన్ సర్వీస్ సెంటర్లు, సచివాలయాల్లో లబ్ధిదారులు ఆధార్, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ తీసుకెళ్లి ఈ పథకం కింద రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు. ఈ పథకం ద్వారా అనేక ప్రయోజనాలు, ప్రతి ఒక్కరూ వృద్ధాప్యంలో ఎంతో భరోసాగా నిలిచే పింఛన్ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు..ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన అనేకమంది అసంఘటిత రంగ కార్మికులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి, గుర్తింపు కార్డులను అందజేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

53 mins ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

7 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

21 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

21 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 day ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

This website uses cookies.