AMARAVATHINATIONAL

కుల ఆధారిత జనాభా లెక్కల సేకరణను తక్షణమే నిలిపేయిండి-పాట్నా హైకోర్టు

అమరావతి: ముఖ్యమంత్రి నితీశ్ కుమార్  ప్రభుత్వం ప్రారంభించిన కుల ఆధారిత జనాభా లెక్కల సేకరణను తక్షణమే నిలిపేయాలని పాట్నా హైకోర్టు గురువారం ఆదేశించింది..ఇంత వరకు సేకరించిన సమాచారాన్ని భద్రంగా కాపాడాలని తెలిపింది..కుల ఆధారిత జనాభా లెక్కలను సేకరించేటపుడు వ్యక్తిగత గోప్యత హక్కును పట్టించుకోలేదని, బిహార్ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది..ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను పరిశీలించినపుడు,, రాష్ట్రంలో సేకరించిన సమాచారాన్ని శాసన సభలోని వివిధ రాజకీయ పార్టీల నేతలతో పంచుకొనే ఉద్దేశం కనిపిస్తోందని వ్యాఖ్యనించింది.. తదుపరి విచారణ జూలైలో జరుగుతుందని తెలిపింది..ఈ సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన రిట్ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే వరకు ఈ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని ఆదేశించింది..

హైకోర్టు ఆదేశాలపై బీజేపీ స్పందిస్తూ, నితీశ్ కుమార్ ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానాన్ని రూపొందించిందని ఆరోపించింది.. సర్వేకు దాదాపు రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనతో, నితీశ్ కుమార్ ప్రభుత్వం జనవరి 7 నుంచి కుల ఆధారిత సర్వేను ప్రారంభించింది..రెండు దశలలో ఈ సర్వేను నిర్వహించాలని నిర్ణయించి,, తొలి దశ జనవరి 7 నుంచి 21 వరకు జరిపింది..రెండవ దశ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమై మే 15తో పూర్తి చేయాలని భావించింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *