రాబోయే నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరే అవకాశం-వాతావరణ శాఖ
అమరావతి: రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత అంతకంతకూ పెరుగుతూ వస్తోంది..కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది..అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది..ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం తీవ్ర వాయుగుండంగా మారింది..ఇది క్రమంగా మరింత బలపడి ఆగ్నేయ దిశగా కదులుతూ బంగ్లాదేశ్ మయన్మార్ వైపు పయనిస్తుందని అంచనా వేసింది..ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం నాటికి బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలు మధ్యలో తుఫాన్ తీరం తీరాన్ని దాటే ఉందని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు..తుఫాన్ తుఫాన్ తీరం దాటే సమయంలో కోస్తాంధ్ర,,రాయలసీమ జిల్లాలపై ఉన్న తేమ గాలులను,, తీవ్ర వాయుగుండం లాగిస్తున్న నేపథ్యంలో వాయు భారత్ నుంచి ఉష్ణగాలులు ఈ ప్రాంతాలను ప్రభావితం చేస్తున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు..వాయు ప్రాంతమైన రాజస్థాన్,గుజరాత్, తెలంగాణ మీదుగా రాష్ట్రానికి ఉష్ణ గాలులు వీస్తున్నాయని తెలిపింది..వేడిగాలులు ప్రభావంతో రాగల నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరి అవకాశం ఉందని స్పష్టం చేసింది..కోస్తాంధ్ర జిల్లాల్లో గరిష్ఠంగా 46 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు..ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కోస్తాంధ్ర జిల్లాలు,,రాయలసీమలో 41 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు..రాయలసీమ, కోస్తాంధ్రా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.