AMARAVATHINATIONAL

ప్రపంచానికి భారతదేశం శాంతి సందేశం బుద్ధుడి ద్వారా అదించింది-ప్రధాని మోదీ

అమరావతి: ప్రపంచానికి భారతదేశం యుద్ధసందేశం అందించలేదని,,శాంతి సందేశం బుద్ధుడి ద్వారా అదించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు..గురువారం ఢిల్లీలోని తొలి ప్రపంచ బౌద్ధ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్న సందర్బంలో మాట్లాడుతూ నేడు ప్రపంచం యుద్ధం,,అశాంతితో సతమతం అవుతుందన్నారు..ఈలాంటి పరిస్థితిలను దృష్టిలో వుంచుకునే శతాబ్దాల క్రితం బుద్ధుడు వీటికి శాంతి పథం అనే పరిష్కారం చూపించాడన్నారు..గౌతమ బుద్ధుని గొప్ప బోధనలు శతాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేశాయన్నారు..బుద్ధుని మార్గమే భవిష్యత్తు,, స్థిరత్వానికి మార్గమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు..బుద్ధ బోధనల నుంచి ప్రేరణ పొందిన భారతదేశం, ప్రపంచ సంక్షేమం కోసం కొత్త కార్యక్రమాలను చేపట్టనున్నదన్నారు..దేశాలు తమ ప్రయోజనాలతో పాటు ప్రపంచ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మోడీ ఉద్ఘాటించారు..అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (IBC) సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 20 , 21 తేదీల్లో గ్లోబల్ బౌద్ధ సదస్సును నిర్వహిస్తోంది..ఈ సదస్సుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖ బౌద్ధ సన్యాసులు,,పండితులు,,ప్రతినిధులు హాజరయ్యారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *