AMARAVATHIHYDERABADPOLITICS

జగనన్నా కాలనీలు పక్క స్కామ్-త్వరలో రిటర్న్ గిప్ట్ ఇస్తా-ఉండవల్లి.శ్రీదేవి

హైదరాబాద్: గత మూడు రోజుల నుంచి  వైసీపీ గూండాలు తనని వేధిస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు..క్రాస్ ఓటింగ్ ఆరోపణల అనంతరం ఆదివారం ఆమె హైదరాబాద్‌లో తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన సందర్బంలో శ్రీదేవి మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డితో తనకు ప్రాణహామీ ఉందని వాపోయారు..సజ్జలపై నేషనల్ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానన్నారు..నాలుగేళ్ళ పాటు తనను వాడుకుని పిచ్చికుక్క మాదిరిగా ముద్రవేసి బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు..సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని,,డబ్బులు ఇచ్చి తన ఆఫీసుపై దాడి చేయించారని తెలిపారు..తాను గెలిచినప్పటి నుంచి తనపై కుట్ర జరుగుతుందని,,ఎందుకంటే వైసీపీ దందాలకు అడ్డొస్తున్నానని తనని టార్గెట్ చేశారని వాపోయారు..అమరావతిలో 10 శాతమైనా అభివృద్ది చేశారా అని ప్రశ్నించారు..జగనన్నా కాలనీలు పక్క స్కామ్ అని శ్రీదేవి ఆరోపించారు..తాను టీడీపీకి ఓటు వేశానో లేదో వారికెలా తెలుసునని ప్రశ్నించారు.. వైఎస్సాఆర్ తనయుడు పార్టీ అంటే విలువలు ఉంటాయని అనుకుని వైసీపీలో చేరానని,,అయితే జగన్ అలాంటి వ్యక్తి కాదన్నారు..ఈ విషయం తనకు ముందే తెలిస్తే అసలు చేరేదాన్ని కాదని తెలిపారు..ప్రాణం ఉన్నంత వరకు అమరావతి రైతుల కోసం పోరాడుతానని చెప్పారు..తాను ఇక నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని, తనకు ఏ పార్టీకి ట్యాగ్ లేదన్నారు..మహిళా ఎమ్మెల్యేకు రక్షణలేని పరిస్థితులు ఏపీలో ఉన్నాయని,, జాతీయ మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానాని చెప్పారు..NHRC హామీ ఇస్తే ఏపీలో అడుగుపెడతానని తెలిపారు..  జగన్ చేసిన పనికి మైండ్ బ్లాక్ అయిందని,, త్వరలో రిటర్న్ గిప్ట్ ఇస్తానని శ్రీదేవి వెల్లడించారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *