DISTRICTS

95 శాతం మేర జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి- త్వరలో సీఎంచే ప్రారంభోత్సవం-మంత్రి అమర్నాథ్

నెల్లూరు: బోగోలు మండల పరిధిలోని రూ.300 కోట్లతో చేపట్టిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు 95 శాతం మేర పూర్తయ్యాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.సోమవారం బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులనుమంత్రి కాకాణి, కావలి ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ రికార్డు సమయంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులను చేపట్టామని,మరో 5 శాతం పనులు మాత్రమే పూర్తి చేయాల్సి ఉందని, ఈ పనులను కూడా త్వరలో పూర్తిచేసి ముఖ్యమంత్రి చే ప్రారంభోత్సవం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు.ఈ హార్బర్ ఏర్పాటుతో సుమారు ఆరువేల మంది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అన్ని విధాల ఈ ప్రాంత రూపు రేఖలు పూర్తిగా మారి పోతాయన్నారు. చెప్పారు.కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బకింగ్ హామ్ కెనాల్ మరమ్మత్తులు, అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి  తమ దృష్టికి తీసుకొచ్చారని, వీటిని పరిష్కరించాలని కలెక్టర్ కు సూచించినట్లు మంత్రి చెప్పారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు, కావలి ఆర్డిఓ శీనా నాయక్, ఏపీ మారిటైం బోర్డు చీఫ్ ఇంజనీర్ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *