కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మాదాల్.విరూపాక్షప్ప అరెస్ట్
అమరావతి: కర్ణాటక చన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే మాదాల్.విరూపాక్షప్ప చైర్మన్గా ఉన్న కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్కు సంబంధించిన లంచం కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు..సోమవారం బెంగళూరుకు వస్తుండగా తుమకూరులోని క్యాత్సంద్ర సమీపంలో విరూపాక్షప్పను లోకాయుక్త పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ అతని కుమారుడు ప్రశాంత్ మాదాల్ పట్టుబడటంతో,,ఈ కేసులో ఎమ్మేల్యే విరూపాక్షప్పను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.. విరూపాక్షప్ప వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జీ బెంచ్ కొట్టివేసింది.. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులకు పట్టుబడ్డాడు..దావణగెరెలోని మాదాల్. విరూపాక్షప్ప నివాసంపై కూడా లోకాయుక్త పోలీసులు దాడులు నిర్వహించగా, ఆయన నివాసంలో కూడా కోట్లాది రూపాయల నగదు దొరికింది.