AMARAVATHINATIONAL

రాజస్థాన్‌లో భారీగా లిథియం నిక్షేపాలు-జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా

అమరావతి: రాజస్థాన్‌లోని డేగనా అనే ప్రాంతంలో లిథియం నిక్షేపాలు కనుగొన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు..జమ్ము కశ్మీర్‌లో గుర్తించిన వాటికంటే ఇక్కడ లిథియం నిల్వలు అధికంగా ఉన్నాయని వెల్లడించారు..ఈ లిథియం నిల్వలు భారతదేశంలో ఉన్న 80 శాతం అవసరాలను తీర్చగలవని భావిస్తున్నారు..క‌ర్ణాట‌క‌లో స్వల్ప స్థాయిలో లిథియం ఖ‌నిజ నిక్షేపాల‌ను గుర్తించారు..ఆటు తరువాత జ‌మ్మూక‌శ్మీర్,,ప్రస్తుతం రాజ‌స్థాన్‌ల‌లో భారీ స్థాయిలో లిథియం గుర్తించారు..ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే బ్యాటరీలలో ప్రధానంగా లిథియాన్ ఉపయోగిస్తారు..ప్రపంచంలో లిథియం నిల్వలు ప్రధానంగా సౌత్ అమెరికా దేశాలైన అర్జెంటీనా, బోలీవియా, చిలీ దేశాల్లో 50 శాతం వరకు కేంద్రీకృతమై ఉన్నాయి..2030 లోగా లిథియంపై ఆధారపడి 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పతత్తి చేయాలని భారత్ భావిస్తోంది..రాజస్థాన్‌లో లిథియం నిల్వలు బయటపడడంతో, ప్రపంచంలో భారతదేశం బ్యాటరీల తయారీ రంగంలో కీలక భూమిక పోషించనున్నది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *