AMARAVATHI

మాగుంట రాఘవరెడ్డికి మరో 11 రోజులు జ్యుడిషియల్ కస్టడీ

అమరావతి: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను స్పెషల్‌ కోర్టు మార్చి 28 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది.. రాఘవరెడ్డి జ్యుడిషియల్ కస్టడీ శనివారంతో ముగిసింది..ప్రస్తుతం రాఘవరెడ్డి తీహార్ జైలులో ఉండగా,,రాఘవరెడ్డిని నేడు సీబీఐ కోర్టులో అధికారులు హాజరుపరిచారు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో విచారణ పురోగతిలో ఉన్నది కాబట్టి మాగుంట రాఘవరెడ్డికి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు సీబీఐ కోర్టులో విజ్ఞప్తి చేశారు..ఈడీ అభ్యర్థన మేరకు మార్చి 28 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కాసేపటి క్రితమే సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది..సౌత్‌గ్రూప్‌లో రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు విచారణలో నిర్ధారించిన ఈడీ అధికారులు ఆపై అతనిని అదుపులోకి తీసుకున్నారు..ఇటీవల 10 రోజుల పాటు ఈడీ కస్టడీలోకి తీసుకుని మాగుంటను విచారించింది..

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

8 mins ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

17 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

20 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

21 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

22 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.