NATIONAL

లోకాయుక్త-2022 బిల్లుకి మహారాష్ట్ర అసెంబ్లీ

అమరావతి: లోకాయుక్త-2022 బిల్లుకి మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది..ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన తొలి రాష్ట్రంగా మ‌హారాష్ట్ర ప్రభుత్వం నిలిచింది..విపక్షాల గైర్హాజరు నేపథ్యంలో ఎలాంటి చర్చ జరక్కుండానే బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందింది..ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ లోకాయుక్త పరిధిలోకి వస్తారు..యూపీఏ-2 ప్రభుత్వం చివరి సంవత్సరంలో లోకాయుక్తపై దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొనడంతో అన్నా హజారే దీక్ష చేపట్టారు..ఇందుకు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మద్దతు ఇచ్చింది..నేడు మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన (షిండే) ప్రభుత్వం ఈ బిల్లుకు ఆమోదం తెలపడం గమనర్హం..వాస్తవానికి లోకాయుక్తకు ఆమోదం తెలిపినప్పటికీ,, దీని అమలులో మహా ప్రభుత్వం కొన్ని మెలికలు పెట్టింది.. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం,, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏదైనా విచారణ ప్రారంభించే ముందు అసెంబ్లీ ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుంది..సభ సమావేశాలకు ముందే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది..అలాంటి తీర్మానాన్ని సభలోని మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల ఆమోదం పొందాలి..లోకాయుక్తలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఛైర్పర్సన్గా ఉంటారు..సీఎం, డిప్యూటీ సీఎం, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, ప్రతిపక్షనేతలు సభ్యులుగా ఉంటారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు..బిల్లును ఆమోదించిన అనంతరం సలహాలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు..ఈ లోకాయుక్త చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఫడ్నవీస్ పేర్కొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

2 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

19 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

22 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

23 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

1 day ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.