AMARAVATHICRIME

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌-ఐదుగురు మావోయిస్టులు మృతి

అమరావతి: జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు..మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం..జార్ఖండ్‌ మావోయిస్టు పార్టీ సెక్రటరీ గౌతమ్ పాశ్వాన్,,చార్లీలు సెంట్రల్ కమిటీ సభ్యులు కాగా నందు,,అమర్ గంజీహు,,సంజీవ్ భూనియా సబ్ జోనల్ సభ్యులని SDPO ఆశోక్ ప్రియాదర్శిన్ వెల్లడించారు..చనిపోయిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులపై రూ. 25 లక్షలు చొప్పున,, సబ్ జోనల్ సభ్యులపైన రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.. రాంచీకి 160 కీ.మీ దూరంలోని చత్ర-పాల్వము సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటనా స్థలం నుంచి రెండు AK-47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. దట్టమైన అటవీప్రాంతంలో CRPF,,COBRA దళాలు కూంబింగ్‌ చేస్తునన్న సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు..పోలీసులు జరిపిన ఎదురుకాల్పల్లో ఐదుగురు మరణించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *