DISTRICTS

కూరగాయల మార్కెట్టులో పరిశుభ్రతను పర్యవేక్షించండి-కమిషనర్ వికాస్

నెల్లూరు: ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్టులో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నియంత్రించి, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక మద్రాస్ బస్టాండ్ ఏ.సీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్టు, రమేష్ రెడ్డి నగర్ లోని గోశాల, కలెక్టరేట్ పరిసరాలు, అర్చన సినిమా హాలు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న చెత్త సేకరణ పనులను అసిస్టెంట్ కలెక్టర్ విద్యాధరితో కలిసి కమిషనర్ బుధవారం ఉదయం పర్యవేక్షించారు.

స్థానిక మద్రాస్ బస్టాండ్ ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్టు లోపల పార్కింగ్ సౌకర్యం గురించి కమిషనర్ పరిశీలించారు. మార్కెట్టు బయట రోడ్డు వెంబడి విక్రయదారులు ఉదయం 7.30 గంటలకు పరిసరాలను శుభ్రం చేసి, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఖాళీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. నగర వ్యాప్తంగా అన్ని ప్రధాన మార్గాలను ఉదయం 7 గంటలలోపు శుభ్రం చేసేలా పర్యవేక్షించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.

కూరగాయల మార్కెట్టు షాపుల నిర్వాహకులతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లలను పూర్తిగా నిషేదించామని, నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వినియోగం, వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాపు ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, షాపుల పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే షాపు నిర్వహకునికి జరిమానా విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు. 

స్థానిక రమేష్ రెడ్డి నగర్ గోశాలను సందర్శించిన కమిషనర్ ప్రాంగణానికి గేటు ఏర్పాటు చేసి సి.సి కెమెరాల సౌకర్యం కల్పించాలని సూచించారు. గోశాల ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా క్రమంతప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు..ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, మార్కెటింగ్ విభాగం ఏ.డి, మార్కెట్టు కాంట్రాక్టరు, శానిటేషన్ సూపర్వైజర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ లు, సచివాలయం శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

10 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

10 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.