AMARAVATHI

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఫెసిటిలేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ల ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకోవడానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఫెసిటిలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసామన్నారు.  ఈనెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఉదయం7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సర్వీస్ ఓటర్లు ఈ సెంటర్లల్లో పోస్టల్ బ్యాలెట్ ల ద్వారా అసెంబ్లీ, పార్లమెంటుకు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అన్నారు. కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఓ.వి రోడ్ లోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో, కావలి జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో, ఆత్మకూరులో పాలిటెక్నిక్ కాలేజీలో, కోవూరులో పి.ఆర్.ఎన్ జడ్పి బాలికల హైస్కూల్లో, ఉదయగిరిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, నెల్లూరు సిటీకి సంబంధించి డీ.కే.డబ్ల్యూ కాలేజీలో, నెల్లూరు రూరల్ కు సంబంధించి వి.ఆర్.లా కాలేజీలో, సర్వేపల్లి కి సంబంధించి క్యూబా ఇంజనీరింగ్ కాలేజీలో ఫెసిటిలేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఇతర జిల్లాల ఓటర్లలకు సంబంధించి నెల్లూరు దర్గామిట్టలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో ఫెసిటిలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. సుమారు 20 వేల మందికి పైగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ చెప్పారు.

ఒకరోజు క్యాజువల్ లీవ్ మంజూరు:- ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు వారికి కేటాయించిన ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ఒకరోజు క్యాజువల్ లీవ్  మంజూరు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ల ద్వారా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

19 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

19 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

23 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.