CRIME

జమ్మూకశ్మీర్‌కు చెందిన జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రీజెన్స్ హేమంత్ హత్య?

అమరావతి: జమ్మూకశ్మీర్‌కు చెందిన జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రీజెన్స్ హేమంత్ కుమార్ లోహియా(57) సోమవారం రాత్రి తాత్కలికంగా నివాసం వుంటున్న అయన స్నేహితుడి ఇంట్లోనే గొంతు కోసి దారుణ హత్య చేయబడ్డాడు. సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశీలించారు.డీజీపీ ఇంట్లో పని చేసే యసీర్ అహ్మద్ హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయన సొంత నివాసంలో చిన్న చిన్న మార్పులు జరుగుతున్న నేపధ్యంలో తాత్కలికంగా జమ్ము శివారు ప్రాంతమైన ఉదయ్​వాలాలోని స్నేహితుని ఇంట్లో నివాసం వుంటున్నారు.6 నెలల క్రిందట హేమంత్ ఇంట్లో పనికి యసీర్ అహ్మద్ అనే వ్యక్తి చేరాడని జమ్ము సినీయర్ పోలీసు అధికారి ముఖేష్ సింగ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయం నుంచి ఆయన ఇంటిలో పని చేసే యసీర్ అహ్మద్ కనిపించకుండ పోయాడు.అయితే వెంటనే పోలీసులు ఆప్రమత్తం కావడంతో, పరారీలో ఉన్న యసీర్ అహ్మద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ హత్యకు అతనికి ఏదైన సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశంలో పలు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తొంది. హత్య జరగడానికి ముందు డీజీ హేమంత్‌ పాదం వాచిందని, లోహియాను హత్య చేసేందుకు, నిందితుడి అయనకు ఊపిరి ఆడకుండా చేసి, అనంతరం పగిలిన సీసాతో గొంతు కోసినట్లుగా ఆధారలు లభించినట్లు తెలుస్తోంది. లోహియా మృతదేహాన్ని తగలబెట్టేందుకు నిందితుడు ప్రయత్నించిన సమయంలో,ఇంటి నుంచి పొగ,మంటలు రావడంతో, బయట వున్న సెక్యూర్టీగార్డులు అప్రమత్తమైన, ఇంటిలోకి వెళ్లి,అయన గది తలుపులు పగులకొట్టి లోనికి ప్రవేశించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోహియా 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి.ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సెంట్రల్‌ డిప్యూటేషన్‌ నుంచి తిరిగి డీజీపీ హోదాలో పదోన్నతి పొంది, ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌ జైళ్లశాఖ డీజీపీగా నియామితులు అయ్యారు.

Spread the love
venkat seelam

Recent Posts

3 నెల‌ల్లో 7వేల ఇళ్లు తిరిగా,ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నా- డాక్ట‌ర్ సింధూర

నెల్లూరు: మూడు నెల‌ల్లో...7 వేల‌ను ఇళ్ల‌ను తిరిగి...ప్ర‌జ‌ల క‌ష్టాలు, స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నాన‌ని...వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నామ‌ని...మాజీ…

31 mins ago

పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం-ముగ్గురు మృతి

అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…

2 hours ago

ప్రశాంతంగా పూర్తియిన 3వ విడత పోలింగ్‌-ఇప్పటి వరకు పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283

అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్‌ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…

3 hours ago

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి- దీపక్ మిశ్రా

నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…

3 hours ago

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

1 day ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

1 day ago

This website uses cookies.