రూ.2 వేల నోట్ల మార్పిడి లేదా డిపాజిట్లకు ఎలాంటి ఆధారలు అవసరంలేదు-ఎస్బీఐ
అమరావతి: ఎస్బీఐ బ్యాంకులో రూ.2 వేల రూపాయి నోట్ల మార్పిడి,, లేదా ఖాతాలో డిపాజిట్ కోసం ఎలాంటి ఐడీ ఫ్రూఫ్ అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తెలియచేసింది..అలాగే ఏ విధమైన ప్రొఫార్మ్ లేక స్లిప్ పూరించాల్సిన పని లేదని ఆదివారం పేర్కొంది..ఈ మేరకు తన అన్ని శాఖలకు ఎస్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది..ఎలాంటి గుర్తింపు కార్డు లేదా ప్రొఫార్మ్ లేకుండా రూ.20,000 వరకు రూ.2,000 నోట్లను బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయవచ్చని లేదా మార్చుకోవచ్చని అందులో పేర్కొంది.. బ్యాంకుల్లో రూ.2,000 నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి కోసం ఆధార్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలు సమర్పించడంతోపాటు ఒక ప్రొఫార్మ్ ను పూరించాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ పైవిధంగా స్పందించింది..