12 వేల మంది పింఛనుదారులు…
నెల్లూరు: అర్హులైన ఏ ఒక్కరు పింఛన్ రాకుండా మిగిలిపోరాదని, వారి అభ్యర్థనలను క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే జనవరి 5వ తేదీలోగా నివేదికలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతినెల మూడు లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 80 కోట్ల రూపాయల మేరకు పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దాదాపు 12 వేల మంది పింఛనుదారులను అనర్హులుగా గుర్తించడం జరిగిందని, వారందరికీ తప్పనిసరిగా నోటీసులు వెంటనే జారీ చేయాలన్నారు.వారి నుండి అభ్యర్థనలను సరైన ఆధారాలతో స్వీకరించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వాటిని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే జనవరి నెల 5వ తేదీలోగా సంబంధిత నివేదికలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు.వారి అభ్యర్థనలను సచివాలయ సిబ్బందితో సహా ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి పరిశీలించాలని సూచించారు.ఈ విషయమై ప్రతిరోజు మండల ప్రత్యేక అధికారులు వ్యక్తిగత శ్రద్ధతో పర్యవేక్షించి రోజువారి నివేదికలు అందజేయాలన్నారు.అర్హులైన ఏ ఒక్క పింఛనుదారు కూడా పింఛన్ రాకుండా తప్పిపోరాదని, అనర్హులు ఏ ఒక్కరు కూడా పింఛను పొందరాదని స్పష్టం చేశారు.
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
This website uses cookies.