MOVIE

మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపిన పవన్

అమరావతి: నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా చిన్న తమ్ముడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు..తెలుగు భాషలో తనకు ఇష్టమైన పదం అన్నయ్య అంటూ ట్వీట్ చేశారు..దోసెడు సంపాదిస్తే.. గుప్పెడు దానం చేయాలనే చిరంజీవి జీవన విధానాన్ని ఎంత పొగిడినా తక్కువేనని తెలిపారు..ప్రతి నమస్కారం కూడా చేయలేని కుసంస్కారికి కూడా చేతులెత్తి నమస్కరించే సంస్కారం చిరంజీవి సొంతమన్నారు..అలాంటి సుగుణాలున్న అన్నయ్యకు తమ్ముణ్ణి కావడం పూర్వ జన్మ సుకృతమని ట్వీట్‌ లో పేర్కొన్నారు..ఆయన సాధించిన విజయాలు, ఆయన కీర్తిప్రతిష్ఠలు, ఆయన సేవాతత్పరత గురించి తెలుగువారితోపాటు యావత్‌ భారత్‌కీ తెలుసు. అన్నయ్యలోని గొప్ప మానవతావాది గురించి చెప్పడమే నాకు ఇష్టం. ఆయన జీవన విధానాన్ని ఎంత పొగిడినా తక్కువే. చెమటను ధారగా పోసి సంపాదించిన దాంట్లోంచి ఎందరికో సాయం చేశారు. పేదరికంతో బాధపడుతున్న, అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన, చదువుకు దూరమైన వారి గురించి తెలియగానే తక్షణమే స్పందించి సహాయం చేసే సహృదయుడు అన్నయ్య.అందరినీ అక్కున చేర్చుకునే విశాల హృదయుడు,అలాంటి సుగుణాలున్న అన్నయ్యకు నేను తమ్ముణ్ణి కావటం నా పూర్వజన్మ సుకృతం. ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని,నాకు తల్లిలాంటి మా వదినమ్మ సహచర్యంలో ఆయన నిండు నూరేళ్లు చిరాయువుగా వర్థిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. అన్న రూపంలో ఉన్న మా నాన్నకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా అని అన్నారు.మెగాస్టార్ గా సినీ ప్రేక్షక హృదయాలలో స్థిరపడిన నటులు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం. మీరు నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

2 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

3 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

6 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

21 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

1 day ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 days ago

This website uses cookies.