నెల్లూరు: పెద్దపవని గురుకుల కళాశాల విద్యార్థినులకు రెండో విడత కౌన్సిలింగ్లో అవకాశం కల్పించాలని కలెక్టర్ హరి నారాయణన్ ఉన్నత విద్య మండలి అధికారులను కోరారు..జిల్లాలోని కావలి మండలం పెద్ద పవని గురుకుల కళాశాలకు చెందిన 37 మంది విద్యార్థినులకు ఇంజనీరింగ్ కోర్సులకు దరఖాస్తు చేయడంలో శ్రీకాళహస్తి కి చెందిన ముప్పాళ్ళ రవి తప్పుదోవ పట్టించి ప్రైవేటు కళాశాలలకు దరఖాస్తు చేశాడని విద్యార్థులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో విద్యార్థులు, కలెక్టర్ కు తమ ఆవేదన తెలియచేశారు. తామంతా మంచిర్యాంకులు సాధించామని తెలిపారు.ఈ విషయమై స్పందించిన కలెక్టర్ ఉన్నత విద్యా మండలి అధికారులతో మాట్లాడారు. రెండవ కౌన్సిలింగ్లో విద్యార్థులకు అవకాశం కల్పించాలని వారిని కోరారు. గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్ హేమలతను సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించిన ముప్పాల రవి పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని ఆదేశించారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.