రాజ్ పథ్ ఇక నుంచి కర్తవ్యపథ్..
అమరావతి: దేశ రాజధానిలో కొత్తగా నామకరణం చేసిన కర్తవ్యపథ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ప్రారంభించారు..తొలుత ఇండియా గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన నేతాజీ సుభాశ్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో బాగంగా ఇండియా గేట్ వద్ద 28 అడుగుల ఎత్తు,6 అడుగుల వెడల్పుతో 300 టన్నుల గ్రానైట్ తో చెక్కిన నేతాజీ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.. ప్రఖ్యాత కళాకారుడు అరుణ్ యోగిరాజ్ ఆధ్వర్యంలో విగ్రహం రూపకల్పన చేశారు.. దేశంలోని ఎత్తైన ఏకశిలా విగ్రహాల సరసన నేతాజీ విగ్రహం చేరింది.. కర్తవ్యపథ్:- ఇండియా గేట్ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మార్గాన్ని ఇక నుంచి కర్తవ్యపథ్గా పిలుస్తారు..నూతన పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కర్తవ్యపథ్ను అభివృద్ధి చేశారు..వలసవాద విధానాలు,,పేర్లు,,చిహ్నాలను రద్దు చేస్తామని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించగా అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పేర్లు మార్పు చేపట్టింది.. బ్రిటిష్వారి కాలంలో కింగ్స్వే(Kings Way) అని పిలవగా స్వాతంత్ర్యం తర్వాత రాజ్పథ్గా నామకరణం చేశారు..నేటి నుంచి కర్తవ్యపథ్గా మారింది..
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.