ప్రధాని నరేంద్ర మోడీ పాదాభివందనం చేసిన పపువా న్యూ గినియా ప్రదాని
అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పట్ల గౌరవం రోజు రోజుకు పెరుగుతొంది అనేందుకు నేడు చేసుకున్న సంఘటన ఒక ఉదహరణ…..జపాన్లో జరిగిన G-7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా (ఆదివారం) పపువా న్యూ గినియాకు చేరుకున్నారు..ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే ఘన స్వాగతం పలికారు.. విమానం దిగి వచ్చిన ప్రధాని మోడీ పాదాలకు మరాపే నమస్కరించారు..వెంటనే మోడీ ఆయన్ను పైకి లేపి భూజాన్ని తట్టి కౌగిలించుకున్నారు.. అనంతరం ప్రధాని మోడీకి ఆ దేశ అధికారులను స్వయంగా పరిచయం చేశారు..పపువా న్యూ గినియాను సందర్శించిన భారతదేశ తొలి ప్రధాని నరేంద్ర మోడీ కావడం విశేషం..
పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశం సూర్యాస్తమయం తరువాత ప్రభుత్వ గౌరవాలతో విదేశీ అతిథులను స్వాగతించదు.. ఇందుకు మినహయింపుగా ప్రధాని మోడీ కోసం ఈ దేశం తన సంప్రదాయాన్ని ప్రక్కకు పెట్టింది.. భారతదేశం యొక్క ప్రాముఖ్యత, ప్రపంచ వేదికపై ప్రధాని మోడీకి పెరుగుతున్న విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకుని, అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం..ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ కార్పొరేషన్ (FIPIC) సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పపువా న్యూ గినియాకు చేరుకున్నారు..ఈ సమావేశంలో 14 దేశాల నేతలు పాల్గొంటారు..పపువా న్యూ గినియా పర్యాటన అనంతరం ప్రధాని మోడీ ఇక్కడి నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు..పాపువా న్యూ గినియాలో ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు..వారు ఉత్సహంగా ప్రధాని మోడీతో సెల్ఫీలు దిగుతూ కనిపించారు.