అమరావతి: అమర్నాథ్ యాత్రకు 2023కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైందని అధికారులు తెలిపారు..జమ్మూ కాశ్మీర్లో 62 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఈ సంవత్సరం జూలై 1వ తేదిన ప్రారంభమై ఆగస్టు 31వ తేదిన ముగుస్తుందన్నారు..అమర్నాథ్కు ఉన్న రెండు దారుల్లోనూ ఒకేసారి యాత్ర ప్రారంభం కానుందని పేర్కొన్నారు.. అనంత్నాగ్ జిల్లా పహల్గాం మార్గం, గందేర్బల్ జిల్లా బల్తాల్ మార్గాల్లో ఒకదాన్ని యాత్రికులు ఎంచుకునే ఆవకాశం వుందని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు..13 నుంచి 37 సంవత్సరాల లోపు వయసున్న వాళ్లు మాత్రమే ఈ యాత్రలో పాల్గొనాలి..యాత్రికులకు ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి..6 వారాలు లేదా అంతకంటే ఎక్కువ గర్భం ఉన్న స్త్రీలను ఈ యాత్రకు అనుమతించరు..అమర్నాథ్ ను దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి యాత్రికులు వస్తుంటారు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాట్లు అధికారులు తెలిపారు.
సీ.ఎస్,డీజీపీల సమావేశం:- అమరావతి: పోలింగ్ రోజు,,ఆటు తరువాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచినట్లు డీజీపీ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ వద్ద ట్యాంకు క్లియర్ వాటర్ పంపింగ్ స్టేషన్ నుండి కొత్తూరుకు…
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
This website uses cookies.