DISTRICTS

కోర్టు కేసులు త్వరితగతిన పరిష్కరించండి- కమిషనర్ శ్రీమతి హరిత

నెల్లూరు: నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటివరకు పెండింగులో ఉన్న కోర్టు కేసుల ప్రస్తుత పరిస్థితిని మరియు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంభందించిన కోర్టు కేసులు పరిష్కారానికి అవసరమైన అన్ని దస్త్రాలను సకాలంలో సిద్ధంచేసి, త్వరగా కేసులు పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకొనవలెనని కమిషనర్ శ్రీమతి హరిత ఆదేశించారు. నగరపాలక సంస్థకు చెందిన ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షించాలని సూచించారు. కార్పొరేషన్ సూచించిన నిబంధనల మేరకే భవన నిర్మాణాలు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. అదే విధంగా రోడ్డును ఆక్రమిస్తూ నిర్మించిన షాపులు, దుకాణాలను గుర్తించి వాటి యజమానులకు ఆక్రమణ పన్నులు విధించి వసూలు చేయాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *