DISTRICTS

జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సదారావు

నెల్లూరు: జిల్లా సమాచార పౌర సంబంధాల(DIPRO) అధికారిగా కె.సదారావు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇంచార్జి DPROగా ఉన్నటువంటి ఎ రమేష్  వద్ద నుండి చార్జ్ తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.అలాగే జిల్లా ఇంచార్జి కలెక్టర్ రోణంకి.కూర్మనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. విజయవాడ సమాచార పౌర సంబంధాల శాఖ, కమీషనర్ వారి కార్యాలయంలో ఉప సంచాలకులుగా పనిచేస్తూ బదిలీ పై నెల్లూరు DIPROగా విధుల్లో చేరారు.ఈ సందర్బంగా సదారావు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రభుత్వం పేద, బలహీన వర్గాల కోసం అమలు చేస్తున్న నవరత్నాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను, గడపగడపకు మన ప్రభుత్వం  తదితర కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తామన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిఐపిఆర్వోకు కార్యాలయ సిబ్బంది ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ పిఆర్ఓ రమేష్, ఏపీఆర్ఓ రవీంద్ర, పిఆర్వో వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

35 mins ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

3 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

6 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

7 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

10 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.